Nov
15
2023
Wednesday
4
40
57
PM
Breaking News

by Pakka Real Estate -- October 05, 2024 in Real Estate News

జేబీ ఇన్‌ఫ్రా గ్రూప్‌ పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు : మీడియాకు వెల్లడించిన మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి
వినియోగదారులను మోసం చేస్తున్న అక్రమార్కులు

హైదరాబాద్, (అక్టోబర్ 4) : రియల్ ఎస్టేట్ రంగంలో 23ఏళ్ల అనుభవంతో కొనుగోలుదారుల నమ్మకం, విశ్వాసమే పునాదులుగా, సొంతింటి కలను అందరికి చేరువ చేయాలనే లక్ష్యంతో వ్యాపారాన్ని విస్తరించామని ప్రముఖ డెవలపర్ జేబీ ఇన్ ఫ్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ కేంద్రంగా పలు జిల్లాల్లో కొత్త వెంచర్లతో అందరికి అందుబాటులో ఉండేలా, పెట్టుబడికి భరోసానిచ్చేలా పదుల సంఖ్యలో ఇప్పటివరకు పూర్తి చేశామన్నారు. అయితే ఇటీవల తమ కంపెనీ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా కొంత మంది మోసపూరితంగా జేబీ పేరిట డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా తెలిసిందన్నారు.

జేబీ ఇన్ ఫ్రా గ్రూప్‌లోనే మేనేజింగ్ డైరెక్టర్‌గా చెప్పుకుంటూ కొంత మోసగాళ్లు మార్కెట్లోకి అడుగుపెట్టారని , జేబీ ఇన్ ఫ్రా గ్రూప్‌ను పోలినట్లుగా ఉన్న కంపెనీలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే తప్పుడు ప్రకటనలతో ఎంతో మంది కొనుగోలుదారులు ఆయా కంపెనీల చేతిలో మోసపోయి, కష్టార్జితాన్ని కోల్పోయిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. జేబీ ఇన్ ఫ్రా గ్రూప్‌ విశ్వసనీయతను నిలుపుకొనేలా, కొనుగోలుదారుల కష్టార్జితానికి భరోసానిచ్చేలా, ఇకపై అలాంటి కంపెనీల చేతిలో మోసపోకూడదనే ఉద్దేశ్యంతోనే తమ మేనేజింగ్ పార్టనర్ సిద్ధార్థ్ రెడ్డితో కలిసి వాస్తవాలను మీడియా ముందుకు తీసుకువస్తున్నట్లుగా తెలిపారు. 

జేబీ ఇన్ ఫ్రా పేరిట కొందరు మోసగాళ్లు, ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఆయా కంపెనీలతో తమకేలాంటి సంబంధం లేదని, కొనుగోలు చేసే ముందు వినియోగదారులు జాగ్రత్త వహించాలన్నారు. ఇప్పటికే జేబీ ఇన్ ఫ్రా గ్రూప్ లోగో మార్ఫింగ్ విషయంలో ఆదిభట్ల పీఎస్‌లో, జేబీ పేరిట జరుపుతున్నట్ల అక్రమ లావాదేవీలపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లుగా అనిల్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తమ కంపెనీ పేరును అప్రతిష్టపాలు చేసేలా, కేవలం అమాయక, పేద, మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలతో తమకేలాంటి సంబంధం లేదన్నారు.

కొనుగోలు చేసే ముందు https://jbinfraprojects.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. అదేవిధంగా మా కంపెనీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతాప్ రెడ్డి, మనోహర్ రెడ్డి, గోవర్థన్ రెడ్డి, జగన్ రెడ్డి మాత్రమే మేనేజింగ్ పార్టనర్లుగా వ్యవహారిస్తున్నారని తెలిపారు. ఈ నలుగురు కాకుండా ఇతరులు ఎవరైనా మేనేజింగ్ డైరెక్టర్లుగా చెప్పుకునే కంపెనీలతో జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఇక తమకు బీఎన్ రెడ్డి నగర్, పెద్ద అంబర్ పేట్, అప్పా జంక్షన్ ప్రాంతాల్లో శాఖలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా, కొనుగోలుచేసే ముందుకు వినియోగదారులు మా వెబ్ సైట్, బ్రాంచ్ కార్యాలయాలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక తమ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్న కంపెనీలు చట్టపరమైన చర్యలు ఉంటాయని, కంపెనీలు నిర్వహించే లావాదేవీలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు customercare@jbinfraprojects.com, లేదా 040-29554577 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Real Estate News

Real Estate Videos

Related News

Trending News

Related Real Estate Videos

Read More

Chat